Monday, March 25, 2024

Janasena : మంగళగిరి కార్యాలయంలో.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ హోమం

ఈ నెల 13న మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన ప్ర‌ధాన కార్యాల‌యంలో హోమం నిర్వ‌హించ‌నున్నార‌ట జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.హోమానికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఏర్పాట్లను పార్టీ నేతలు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇది ఇలా ఉండ‌గా మరోవైపు వారాహి యాత్రకు సంబంధించి పోస్టర్ ను జనసేన సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా నుంచి పవన్ యాత్ర ప్రారంభం కానుంది. అన్నవరం ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం పిఠాపురం, ప్రత్తిపాడు, కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుంది. అనంతరం పశ్చిమగోదావరి జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తుంది. కాగా ఏపీలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టాయి. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఈ నెల 14 నుంచి వారాహి యాత్రను చేపట్టబోతున్నారు. తన ప్రచార రథంతో రాష్ట్రమంతా చుట్టేయనున్నారు. అయితే, తన యాత్రకు దైవబలం కూడా తోడయ్యేందుకు హోమం నిర్వహించాలని ఆయన నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement