Friday, May 3, 2024

Breaking | లారీ డ్రైవర్​ ర్యాష్​ డ్రైవింగ్​.. పాదచారులపై దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బోగోలు మండలంలోని కడనూతల జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ఈ యాక్సిడెంట్​ జరిగింది. చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న లారీ, ముందు వెళ్తున్న మరో లారీని ఢీకొట్టి పక్కకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో పాదయాత్రగా వెళ్తున్న ఇద్దరు భక్తులను ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. సంఘటనా స్థలాన్ని కావలి డీఎస్పీ వెంకటరమణ పరిశీలించారు..

కాగా, మృతుల్లో తూర్పుగోదావరి జిల్లా నిడమునూరు నుండి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన సుబ్బరాజ (60), రామానాయుడు (65) అక్కడికక్కడే చనిపోయారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కావలి రూరల్‌ సీఐ రాజేష్‌ , బిట్రగుంట ఎస్సై శేఖర్‌ బాబు , పోలీసు సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement