Saturday, April 20, 2024

Big Breaking | కారును ఢీకొన్న లారీ, ఇద్దరు మృతి.. నెల్లూరు​ జిల్లాలో ఘోరం

నెల్లూరు​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవ్వాల (శనివారం) సాయంత్రం కావలి మండలంలో ఈ ఘటన జరిగింది. కారును లారీ ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్​ జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరారం వద్ద ఈ యాక్సిడెంట్​ జరిగింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కావలి, (ప్రభ న్యూస్): ముందు వెళ్తున్న‌ లారీని కారు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురుకి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం జాతీయ రహదారిపై చోటుచెసుకుంది. గౌరవరం జాతీయ రహదారిపై ముందువెళ్తున్న లారీని కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. నెల్లూరు జిల్లా కేంద్రంలోని కల్లూరుపల్లి హౌసింగ్ కాలనీకి చెందిన అనంతరాజు లక్ష్మినారాయణ, భార్య అనంతరాజు ఆదిలక్ష్మి, మోక్షగుండం అనుపమ, నాగమణి, డ్రైవర్ సురేష్ మొత్తం అయిదుగురు ప్రకాశం జిల్లా మాలకొండకు దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వ‌స్తున్నారు.

కాగా, మార్గం మధ్యలో కావలి మండలం గౌరవరం జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ముందు వెళ్తున్న లారీని కారు బలంగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జ‌రిగింది. దీంతో అనంతరాజు లక్ష్మీనారాయణ, నారాయణమ్మను నెల్లూరుకు తరలించగా నెల్లూరులో చికిత్స పొందుతూ లక్ష్మీనారాయణ చ‌నిపోయాడు. అనంతరాజు ఆదిలక్ష్మి, మోక్షగుండం అనుపమ, డ్రైవర్ సురేష్ చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ డ్రైవర్ సురేష్ చ‌నిపోయాడు. మిగిలిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కావలి రూరల్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement