Tuesday, May 7, 2024

లోకేష్ చేసేది ఈవెనింగ్ వాక్ – వెల్లంపల్లి, మల్లాది,దేవినేని

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరోప్రజలను మభ్య పెట్టేందుకు లోకేష్ ఈవినింగ్ వాక్ చేస్తున్నారని, ప్రస్తుతం పవన్ బాబు లొకేషన్ రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ లు పేర్కొన్నారు. చంద్రబాబు తన సొంత కుమారుడు తో పాదయాత్ర చేయిస్తున్నా, ప్రజలను నుండి ఆదరణ లేదనీ,తెలుసుకున్న బాబు పవన్ కళ్యాణ్ తో వరహి యాత్ర చేయిస్తున్నాడన్నరు.పవన్ మాటలు ఎవరికి అర్థం కావటం లేదన్నారు. పొంతనల లేని మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారవృద్ద తండ్రి అయిన చంద్రబాబు కూడా యాత్రలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.

.వీరు ముగ్గురు విజయవాడ గుంటూరు నీ మోసం చేసిన వ్యక్తులు అన్నారు. దేవాలయాలను కూల్చేసిన వీరు ముగ్గురు హిందూ ద్రోహులు గా రాష్ట్ర చరిత్ర నిలిచిపోయారన్నారు. వారికి ఉన్న మీడియా ద్వారా జగనన్న ప్రభుత్వం పై బురద చలుతున్నారాన్నరు. టీడీపీ జనసేన వాళ్ల కి జగనన్న సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రభుత్వం మాది అన్నారు. ప్రజలు అంతా జగన్ వైపే ఉన్నారనీ చెప్పారు.

చంద్రబాబు కి లోకేష్ చేసే పాదయాత్ర పై నమ్మకం ఉందా అని ప్రశ్నించారు.175 లో పోటీ చెయ్యగలరా అన్నారు.ప్రజా బలం ఉంటే అన్ని స్థానాలలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. లోకేష్ చేసేది ఈవినింగ్ వాక్ మాత్రమే అన్నారు.విజయవాడ నగరం గురించి మాట్లాడలేని వ్యక్తి లోకేష్ అన్నారు. టీడీపీ ఎంపీ లు లోకేష్ యాత్రను బహిష్కరించారను గుర్తు చేశారు

. ఆర్యవైశ్యులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు ను ఎలా నమ్ముతారన్నారు.ఆర్యవైశ్యలను అన్ని రకాలుగా ఆదుకుంటుంది జగనన్న మాత్రమే అన్నారు. ఆర్యవైశ్యులకి మేలు చేసింది వైకాపా ప్రభుత్వం అన్నారు. పొట్టి శ్రీరాములు ని అవమానించింది చంద్రబాబు అయితే గౌరవించింది జగన్ మాత్రమే అన్నారు. ఆర్యవైశ్యులు పై మీ కపట ప్రేమలు పనికిరావన్నారు.పవన్ కళ్యాణ్ సినిమాలలో రాజకీయాలలో జీరో గా తెలిపారు. జగన్ పై ఏక వచనం తో దూషిస్తే సహించేది లేదనీ హెచ్చరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement