Sunday, May 5, 2024

Lives Save – 60 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవ‌ర్ స‌మ‌య‌స్ఫూర్తి….

పాడేరు – అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. పాడేరు ఘాట్ రోడ్ రాజపురం వద్ద ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయి. దాంతో.. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి పెను ప్రమాదం నుంచి తప్పించాడు. కొండగట్టును ఢీకొని ఆగిపోయేలా చేశాడు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌. బస్సులో 70 మంది ప్రయాణికులు ఉండగా.. అందరూ క్షేమంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. బ్రేకులు ఫెయిల్‌ పెద్దశబ్దం వచ్చి.. బస్సు పక్కకు దూసుకెళ్లడంతో ప్రయాణికులు కంగారు పడిపోయారు. అయితే.. డ్రైవర్‌ అప్రమత్తతతో కొండగట్టుకు ఢీ కొట్టి.. బస్సుని నిలువరించాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఒకవేళ బస్సు డ్రైవర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకుండా ఉండి కంగారు పడినట్లు అయితే ఆ బస్సు పక్కనే ఉన్న సుమారు 60 అడుగుల లోయలోకి బస్సు దూసుకుని పోయి ఉండేదని తెలుస్తోంది. తమకు ప్రాణాపాయం తప్పడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. గమ్య స్థానం చేరుకోవడనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేరుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన తమ ప్రాణాలను కాపాడిన డ్రైవర్‌ను ప్రయాణికులతోపాటు అధికారులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement