Friday, April 26, 2024

Breaking: అహోబిలంలో చిరుత కలకలం.. భక్తుడిపై దాడి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో చిరుత కలకలం రేపింది. కర్నూలు జిల్లాలోని ఎగువ అహోబిలంలో పావన నరసింహస్వామి ఆలయానికి కాలినడకన వెళ్తున్న భక్తుడిపై చిరుత దాడి చేసింది. మెట్ల మార్గంలో కాపు కాసిన చిరుత ఒక్కసారిగా భక్తుడిపైకి దూకి దాడి చేసింది. అయితే, ఈ ఘటన నుంచి బాధిత భక్తుడు చాకచక్యంగా తప్పించుకుని ప్రాణాలు రక్షించుకున్నాడు. వారం రోజులుగా ఇక్కడ చిరుత సంచరిస్తోందని భక్తులు చెబుతున్నారు. మెట్లమార్గం గుండా వెళ్లేందుకు భక్తులు భయపడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement