చంద్రయ్యను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాప్ అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…. చంద్రయ్య హత్యను ఖండిస్తున్నామన్నారు. ఏపీలో హత్యా రాజకీయాలను పెంచి పోషిస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే పల్నాడులో అరాచకాలు పెరిగిపోయాయన్నారు. ఎంతో మంది టీడీపీ కార్యకర్తలను బలి తీసుకున్నారన్నారు. ఇకపై వైసీపీ అరాచకాలను సహించేది లేదన్నారు. చంద్రయ్య కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital