కర్నూలు : మండల పరిధిలోని జొన్నగిరి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడడంతో గ్రామంలోనే విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జొన్నగిరిలో విపరీతమైన గాలులు, మెరుపులతో వర్షం పడడంతో విద్యుత్ స్తంభాలు పడిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ట్రాన్స్ కో అధికారులు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినందుకు విద్యుత్ శాఖ అధికారులు జొన్నగిరి గ్రామానికి చేరుకున్నారు.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2023/06/image-41-576x1024.png)