Sunday, May 5, 2024

పేపర్ లీకేజ్ నందికొట్కూరులో జరగలేదు : ఎస్పీ రఘువీరా రెడ్డి

నందికొట్కూరు, పలు సోషల్ మీడియాలో నందికొట్కూరులో పదవ తరగతి పరీక్ష పత్రం లీకైందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని నంద్యాల జిల్లా ఎస్ పి రఘువీరారెడ్డి తెలిపారు. శనివారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని గాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రం పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… నందికొట్కూరు గాంధీ మెమోరియల్ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తున్నారన్నారు. పరీక్ష పత్రం లీకైందనే విషయంపై విచారిస్తున్నామని త్వరలో ఎవరు చేశారన్నది పట్టుకుంటామని.. నందికొట్కూరులో జరిగిందా లేక వేరే ఎక్కడైనా జరిగిందా అనే విషయంపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నామన్నారు. ఎస్ పి తో పాటు నంద్యాల, కర్నూలు విద్యాశాఖ అధికారులు చిదానంద, రంగారెడ్డి లు, ఆత్మకూరు డి ఎస్ పి శృతి, స్పెషల్ బ్రాంచ్ డి ఎస్ పి మహేశ్వర రెడ్డి, నందికొట్కూరు రూరల్, టౌన్ సిఐ లు ప్రసాద్, నాగరాజ రావు, ఎస్ఐ లు మారుతీ శంకర్, ఎన్ వి రమణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement