Tuesday, May 7, 2024

35 అడుగులు పైకెగిరి కింద‌ప‌డ్డ మెకానిక్ మృతి..!!

పెట్రోల్ లారీపై మూత రిపోర్ చేస్తున్న క్ర‌మంలో వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న నంద్యాల జిల్లా ఎర్రగుంట్లలో చోటుచేసుకుంది. మంగళవారం ఎర్రగుంట్ల లోని పెట్రోల్ బంక్ కు సంబంధించిన పెట్రోల్ లారీ ట్యాంక్ పైన మూత రిపేరి చేస్తుండగా ఒక్క సారిగా భారీ శబ్దంతో హైర్‌ ఓపెన్ అయ్యింది. ఈ హైర్ శబ్దంలో మెకానిక్ నాగరాజు దాదాపు 35 అడుగుల పైకి గాలిలో ఎగిరి.. చివరకు 40 అడుగుల దూరంలో మార్తోమ చర్చి ఆవరనంలో ప‌డ్డాడు. ఇది గ‌మ‌నించిన స్థానిక సిబ్బంది నాగ‌రాజు వ‌ద్ద‌కు వెళ్ల‌గా అక్కడికక్కడే తుది శ్వాస వదిలారు. భారీ పేలుడు శబ్దం సంభవించడంతో జనం ఉల్లిక్కి పాటుకు గురయ్యారు. వందలాది మంది సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన ప్రమాదం గురించి చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement