Saturday, May 4, 2024

ఉగ్ర‌పోరులో అమ‌రుడైన మ‌ద్దూరు ఆర్మీ జ‌వాన్ సురేంద్ర ..

ఉమ్మడి కర్నూలు జిల్లా – జ‌మ్మూ క‌శ్మీర్ లో జ‌రిగిన ఉగ్ర‌వాద పోరులో క‌ర్నూలు జిల్లాకు చెందిన జ‌వాన్ అమ‌రుయ్యాడు.. శ్రీన‌గ‌ర్ బేస్ క్యాంప్ లో విధులను నందికొట్కూరు నియోజకవర్గం, పాములపాడు మండలంలోని మద్దూరు గ్రామానికి చెందిన సిరిగిరి సురేంద్ర నిర్వ‌హిస్తున్నారు.. ఈ నేప‌థ్యంలో ఉగ్ర‌వాద ఏరివేత కార్య‌క్ర‌మంలో జ‌రిగిన ఎదురెదురు కాల్పుల‌లో సురేంద్ర అమ‌రుడయ్యాడు.. ఈ విష‌యాన్ని ఆర్మీ అధికారులు సురేంద్ర పేరేంట్స్ తెలీయ‌జేశారు.. దీంతో అత‌డి కుటుంబం శోక స‌ముద్రంలో మునిగిపోయింది.. కాగా సురేంద్ర మృత‌దేహాన్ని స్వ‌గ్రామానికి అధికారులు పంపుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement