Sunday, May 26, 2024

Kurnul – వాలంట‌రీతో క‌ల‌సి ఓట‌రు స‌ర్వే – బిఎల్ఓపై వేటు వేసిన క‌లెక్ట‌ర్

కర్నూలు – ఎన్నికల కమిషన్ ఆదేశాల పాటించకుండా వాలంటరీ తో కలిసి సర్వే చేసినవెల్దుర్తి బిఎల్ఓపై వేటు పడింది. కర్నూల్ కలెక్టర్ సృజన శనివారం సస్పెన్షన్ చేసింది. వీటిపై ఆర్డీవోకు విచారణ ఆదేశాలు జార్జ్ చేశారు. ముఖ్యంగా ఇటీవల కర్నూలు జిల్లాలో ఇంటింటికి ఓటర్ల సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో నిర్లక్ష్యం వహించిన కర్నూల్ రెవిన్యూ డివిజన్ లోని వెల్దుర్తి మండల కేంద్రంలో బిఎల్ఓ, వాలంటరీ తో కలిసి ఇంటింటా సర్వే లో పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సుజనా సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం టెలికాన్ఫిడెంట్ ద్వారా. జిల్లా ఎన్నికల యంత్రాంగంతో సమీక్షించారు.

ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే. శాఖ పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఇంటింటా. వాలంటరీ తో కలిసి సర్వే చేస్తే సస్పెన్షన్ ఉంటాయని సూచించారు.. నియోజకవర్గ ఆర్వో కూడా ఇందుకు బాధ్యుడు అవుతాడని హెచ్చరించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement