Friday, April 26, 2024

జగనాసురుడు – అవినీతి, నేరాల రాక్షసుడు

జగనాసురుడు – అవినీతి, నేరాల రాక్షసుడనీ, జగన్ రెడ్డి చేస్తున్న అవినీతి, నేరాలపై సోమవారం కర్నూలు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు యస్.అబ్బాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక బుధవారపేటలోని డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ పది తలల ఫ్లెక్సీతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఫ్లెక్సీని దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా అబ్బాస్, గున్నా మార్క్, పోతురాజు రవికుమార్ మాట్లాడుతూ.. జగన్ సిగ్గులేకుండా తన తండ్రి మరణాన్ని వాడుకుని ఓదార్పు అన్న పేరుతో 2014 ఎన్నికలకు ముందు రాజకీయంగా ఎదగాలని ప్రయత్నించాడు. 2019 ఎన్నికలు వచ్చేసరికి సొంత బాబాయిని హతమార్చి మళ్లీ తన సంకల్ప యాత్రకు నాందిపలికి తనకు శవరాజకీయాల్లో ఉన్న నేర్పుని మరో సారి బయటపెట్టాడన్నారు.

తన స్వార్ధప్రయోజనాల కోసం కుటుంబాన్ని సైతం బలిచేసాడన్నారు. వివేకానంద రెడ్డి కేసులో నిందితులే దీనికి ఒక ఉదాహరణ అన్నారు. తొలుత వారి పత్రికలో వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని చెప్పి, తరువాత దానిని మసిపూసి మారేడుకాయచేసి నారాసుర రక్త చరిత్రగా వర్ణించి టీడీపీపై బురదజల్లే ప్రయత్నం కూడా చేసారన్నారు. భూమాఫియా, మైనింగ్ మాఫియా, రైతు వ్యతిరేకి, రాబంధు, బాబాయ్ హంతకులు, కీచకులు, బస్మాసురుడు, అబద్దాల కోరులు, లిక్కర్ మాఫియా వంటి పదితలల పాలన సాగిస్తున్న జగనాసుర అవినీతి, నేర రాక్షసులపై తెలుగుదేశం పార్టీ అవిశ్రాంత పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, జూటూరు రవి, నరేంద్రనాథ్, పోతుల రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement