Wednesday, May 22, 2024

AP: కోడుమూరు టీడీపీ మాజీ ఇంచార్జ్ ఆత్మహత్యయత్నం..

కర్నూలు జిల్లా పరిధిలోని కోడుమూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఇంచార్జి ప్రభాకర్ సోమవారం మహబూబ్ నగర్ జిల్లాలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సార్వత్రిక ఎన్నికల్లో కోడుమూరు టికెట్ తనకే వస్తుందని ప్రభాకర్ ఆశ పెట్టుకున్నారు. అయితే ఆయనకు కాదని.. బొగ్గుల దస్తగిరి అని వ్యక్తికి పార్టీ టికెట్ కేటాయించింది.

దీంతో మనస్థాపానికి గురైన ప్రభాకర్ ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ప్రస్తుతం ఆయనను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నారు. గత 30 ఏళ్లుగా టీడీపీని నమ్ముకుని సేవలు చేసిన తన భర్తకు అవకాశం ఇచ్చే అంశంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పరిశీలించాలని కోరారు. ఒకవేళ ప్రభాకర్ కి ఏదైనా జరిగితే తమ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుందని ప్రభాకర్ భార్య పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement