Friday, May 3, 2024

AP: ముగిసిన కర్నూలు పంచాయితీ – వైసీపీ ఇన్‌చార్జిగా ఇలియాజ్ బాషా

కర్నూలు (ప్రభ న్యూస్​) – కర్నూలు వైసీపీ ఇన్‌చార్జి నియామకం పంచాయితీ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఇలియాజ్ బాషాను వైసీపీ నిర్ణయించినట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను సీఎంవోకు పిలిపించి చర్చించిన త‌ర్వాత‌ పార్టీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కాగా, సీఎం జగన్‌ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ విజయవాడలోని ఆయన స్వగృహంలో తన తండ్రి మోయిజ్ ఖాన్ తో మర్యాదపూర్వకంగా క‌ల‌వ‌డం విశేషం.

కర్నూలు జిల్లా పరిశీలకులు … ఆరుగురిని నియామించిన వైసీపీ

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ పరిశీలకులను అధిష్ఠానం శుక్రవారం నియమించింది. ఇందులో పాణ్యం పరిశీలకునిగా మార్క్ ఫెడ్ రాష్ట్ర ఛైర్మన్ పీపీ నాగిరెడ్డిని, కర్నూలుకు కోగటం విజయభాస్కర్ రెడ్డిని, ఆలూరుకు తెర్నేకల్ సురేంద్ర రెడ్డిని, ఎమ్మిగనూరుకు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పరిశీలకులుగా నియమించింది. శ్రీశైలానికి మైనార్టీ శాఖ రాష్ట్ర సలహాదారు హబీబుల్లా, బనగానపల్లెకు షేక్ బాబూలాల్ కు పరిశీలకులుగా నియమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement