Tuesday, May 7, 2024

Kuppam : టిడిపిలో చేరిన .. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సురేష్ బాబు

కుప్పం (ప్రభ న్యూస్ ): చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ బాబు ..టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచుకొన్నారు. కుప్పం మాజీ ఎమ్మెల్యే బి. ఆర్ దొరస్వామి నాయుడు తనయుడు డాక్టర్ సురేష్ బాబు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జూడా అధ్యక్షులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చురుకైనా పాత్ర పోషించారు. అదేవిధంగా 15 సంవత్సరాల నుండి కుప్పం, చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చూస్తూ, గత అసెంబ్లీ ఎన్నికలల్లో కుప్పం నుండి చంద్రబాబు పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, సురేష్ బాబు ఒకే సామజిక వర్గం కావడంతో కుప్పం నియోజకవర్గంలో విస్తృత పరిచయలు కల్గిన డాక్టర్ గా సురేష్ బాబు సుపరిచితులుగా ఉండడంతో ఆయన సేవలను వినియోగించుకోనేందుకు సిద్దమై టిడిపి ఆహ్వానించింది. డా. సురేష్ బాబు అనుచరులు, బి ఆర్ డి అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు చంద్రబాబు చేతుల మీదుగా తెదేపా కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు ..సురేష్ బాబును తెలుగుదేశం పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు. సురేష్ బాబు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంతో పాటు చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement