Wednesday, April 24, 2024

కృష్ణా జిల్లా య‌న‌మ‌ల‌కుదురులో ఉద్రిక్త‌త..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ‘‘ఇదేమి కర్మ రాష్ట్రానికి’’ కార్యక్రమంలో భాగంగా పెనమలూరు నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శ్రీకారం చుట్టారు. పెనమలూరు నియోజకవర్గంలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారంటూ ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శనకు దిగారు. యనమలకుదురు బ్రిడ్జిపై టీడీపీ నిరసన చేపట్టింది. కాగా.. నిరసన కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్లను వెంటనే ఇక్కడ నుంచి పంపించి వేయాలంటూ వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. టీడీపీ నాయకుల మీదకు దూసుకువచ్చిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువ‌ర్గాల‌కు పోలీసులు స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement