Monday, April 29, 2024

AP | సేవ్‌ అమరావతి పాదయాత్ర.. హైద‌రాబాద్ నుంచి ఏపీకి

(ఇబ్రహీంపట్నం ప్రభ న్యూస్) : ‘జై అమరావతి, సేవ్‌ అమరావతి’ నినాదంతో హైదరాబాద్‌ నుంచి ఏపీలోని అమరావతికి పాదయాత్ర చేపట్టిన అమరావతి పరిరక్షణ సంఘం అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావుకు తుమ్మలపాలెం గుంటుపల్లి నేతలు మంగళవారం ఉదయం స్వాగతం పలికారు. పాదయాత్రలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు కొద్దిసేపు పాదయాత్ర చేశారు.

తుమ్మలపాలెం, గుంటుపల్లి, నల్లకుంట గ్రామాల మీదుగా మరికొద్దిసేపట్లో పాదయాత్ర గొల్లపూడి చేరుకొనుంది. గొల్లపూడి లో అల్పాహారం అనంతరం విజయవాడ నగరంలోకి ప్రవేశించనున్న ‘జై అమరావతి, సేవ్‌ అమరావతి’ పాదయాత్ర కోసం రహదారి పొడుగునా ప్రజలు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement