Friday, May 3, 2024

AP : మాజీమంత్రి దేవినేని సోదరుడు మృతి..

(ప్రభ న్యూస్ కంచికచర్ల) : మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర రావు (56) గురువారం వేకువజామున హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధి చికిత్స నిమిత్తం కోసం హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో గత నాలుగు రోజులుగా చంద్రశేఖర్ కు చికిత్స అందిస్తున్నారు.

మాజీ మంత్రి దేవినేని ఉమ మూడు రోజులుగా హైదరాబాదులోనే ఉండి తన సోదరుడి ఆరోగ్య పరిస్థితి పట్ల శ్రద్ధ వహించారు. పరిస్థితి విషమించడంతో చంద్రశేఖర్ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 10 గంటలకు హైదరాబాదు నుండి కంచికచర్లకు ఆయన పార్థీవ‌దేహాన్ని తీసుకువస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట తరువాత దహన క్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చంద్రశేఖర్ మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం సానుభూతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement