Thursday, April 25, 2024

స్వాతంత్య్ర స్ఫూర్తిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి… పవన్ కల్యాణ్

స్వాతంత్య్ర స్ఫూర్తిని కొన్ని రోజులకే కాకుండా కడవరకు గుర్తుంచుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. విజయవాడలోని మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వాతంత్య్రం కోసం పోరాడిన వారందరి త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారి ఆశయాలను తీర్చేందుకు జనసేన ముందుకు వచ్చిందని తెలిపారు. రాజకీయ పార్టీలకు సైద్ధాంతిక బలం లేనిదే పార్టీ ముందుకు వెళ్లలేదన్నారు. కులం, మతం, ప్రాంతీయతత్వంతో ముందుకు సాగే పార్టీల మనుగడ కొద్దిరోజులకే పరిమిత మవుతుందని పేర్కొన్నారు. నాటి స్వాతంత్య్ర సమరయోధులు ఏనాడు కులం, మతంతో పనిచేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాదెండల్ మనోహర్‌, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement