Friday, May 3, 2024

శ్రీ కృష్ణదేవరాయల వర్సిటీ స్నాతకోత్సవం.. హాజ‌రైన గ‌వ‌ర్న‌ర్ న‌జీర్

అనంతపురం : శ్రీ కృష్ణదేవరాయల యూనివర్సిటీలో 21వ స్నాతకోత్సవం సోమవారం ఉదయం కన్నులపండుగగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కులపతి హోదాలో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజయ్యారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్ యం.గౌతమి, ఎస్కేయూ వైస్ ఛాన్స్లర్ ప్రొ.మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి, సెంటర్ యూనివర్సిటీ విసి ఘోరీ, స్పిరిట్ స్పోర్ట్స్ ఇండియా అవార్డు మరియు దివ్యజ్ఞాన ఎంపవర్మెంట్ అవార్డు గ్రహీత మహంతేష్. జికే, ఎస్కేయు రిజిస్టర్ లక్ష్మయ్య, డిన్స్ నాగభూషణం రాజు, జీవి.రమణ, శివకుమారి, ఎమ్మెల్సీ మంగమ్మ, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, రాష్ట్ర నాటక అకాడమీ చైర్పర్సన్ హరిత, డిగ్రీ కలశాలల ప్రిన్సిపాల్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పట్టభద్రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement