Friday, April 26, 2024

వైసీపీ ప్రభుత్వంపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో మరో 6 నెలల తర్వాత చిత్రవిచిత్రాలు చూస్తారంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మరోసారి కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.. మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశానన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అభద్రతాభావంలో ఉన్నారన్నారు. ఫోన్లు మాట్లాడుకునే ధైర్యం చేయలేకపోతున్నారని బాంబ్‌ పేల్చాడు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి. విచారణ జరిపితే మిగిలినవారి ట్యాపింగ్ బయట పడుతుందన్నారు. సజ్జల నా మిత్రుడికి ఇవ్వాల్సిన స్క్రిప్ట్ సరిగా ఇవ్వలేకపోయారన్నారు. కేంద్ర హోంశాఖను విచారణ కోరేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆగ్రహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement