Sunday, May 5, 2024

Janasena : పవన్‌ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ కీలక నేతలు

ఏపీలోని వైసీపీ కీలక నేతలు జనసేన పార్టీలో చేరారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ సమక్షంలో మంగళగిరి కేంద్ర కార్యాలయంలో నాలుగు జిల్లాలకు చెందిన వైసీపీ ముఖ్య నేతలు జనసేన పార్టీలో చేరారు.. పార్టీ కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ జనసేన కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

జనసేన పార్టీలో చేరిన నేతలు చిలకలపూడి పాపారావు సర్పంచ్‌, ఆంధ్రప్రదేశ్ సర్పంచ్‌ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కృష్ణా జిల్లా వైసీపీ నేత.. చిక్కాల దొరబాబు- తూర్పుగోదావరి వైసీపీ నాయకులు, దుగ్గన నాగరాజు- తూర్పుగోదావరి వైసీపీ నాయకులు, కలగ పాల్ పురుషోత్తం – తూర్పుగోదావరి వైసీపీ నాయకులు, ఎదురువాక వెంకటగిరి- తూర్పుగోదావరి వైసీపీ నాయకులు, పొగిరి సురేష్ బాబు – శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకులు, వై శ్రీనివాస్ రాజు – కడప జిల్లా వైసీపీ నాయకులతో పాటు.. మరికొందరు నేతలు కూడా పార్టీలో చేరారని జనసేన పార్టీ నేతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement