Wednesday, May 1, 2024

ఎర్రచందనం అక్రమ రవాణాపై దాడులు

క‌డ‌ప జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎర్ర చందనం అక్రమ రవాణాపై పోలీసులు దాడలు నిర్వహించారు. ఒంటిమిట్ట పరిధిలోని లంకమల్ల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న అంతర్ జిల్లా ముఠాను అదుపులోకి తీసుకున్నారు. 9 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి 49 ఎర్రచందనం దుంగలు, రవాణాకు ఉపయోగించిన 2 కార్లు, 2 బైక్స్, 7 మొబైల్స్, గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై పీడీయాక్టుతో పాటు కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement