Sunday, April 28, 2024

Jogi Ramesh: పవన్ కల్యాణ్ పై మండిప‌డ్డ జోగి ర‌మేష్..

గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గృహ నిర్మాణాల భూ సేకరణలో అవినీతి జరిగినట్లు ప్రధానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ లేఖ రాయడంపై మండిపడ్డారు. తాడేపల్లిలో మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ అధినేత నారా చంద్రబాబు కొట్టేసిన స్కిల్ స్కాంలో పవన్ కల్యాణ్‌కు ఎంత ముట్టిందో విచారణ చేయమని తాము కూడా లెటర్ రాయబోతున్నామన్నారు. మనీ లాండరింగ్ ఎలా జరిగిందో విచారణ జరిపించాలని కోరతామని, ఆ ప్రభుత్వంలో పవన్ కూడా భాగస్వామే అని జోగి రమేష్ తెలిపారు. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన 13 అంశాలకు సమాధానాలను మీడియా ద్వారా అందజేస్తున్నామ‌న్నారు. పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ డోర్ నెంబర్ ఉందా ?, కనీసం ఏపీలో ఓటు ఉందా ? లేదా ఆధార్ కార్డ్ ఉందా ?. చంద్రబాబు ఇచ్చే డబ్బుల కోసం ఏ గడ్డి అయినా కరవటానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

తాము కూడా లెటర్ రాయబోతున్నాం.. చంద్రబాబు కొట్టేసిన స్కిల్ స్కాంలో పవన్ కల్యాణ్‌కు ఎంత ముట్టిందో విచారణ చేయమని లేఖ రాస్తామ‌న్నారు. మనీ లాండరింగ్ ఎలా జరిగిందో విచారణ జరిపించాలని కోరతామ‌న్నారు. చంద్రబాబు స్కిల్ స్కాంపై విచారణ చేయమని ఎందుకు లేఖ రాయలేదు ?. పేదలకు మూడు సెంట్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చాం.. ఎందుకు నెరవేర్చ లేదని చంద్రబాబును ప్రశ్నించావా ?. ప్రజలను మోసం చేసిన ప్రభుత్వంలో పవన్ కూడా భాగస్వామే కదా.. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇస్తుంటే ఎందుకు మీకు అంత కడుపుమంట ?. ప్రతి గ్రామాన్ని జగన్ అభివృద్ధి చేస్తుంటే.. ప్రధానికి లేఖ రాస్తాడట. చంద్రబాబు, లోకేష్ దోచుకున్న డబ్బుల మీద లేఖ రాయి అని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement