Friday, May 3, 2024

జనసేన వీర మహిళ.. ప్రాంతీయ కమిటీల నియామకం

అమరావతి, ఆంధ్రప్రభ : జనసేన వీర మహిళ ప్రాంతీయ కమిటీలను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు గురువారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ కమిటీలకు ఆమోదం తెలుపి ఉత్తర్వులు విడుదల చేశారు. ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా, పెన్నా, రాయలసీమ ప్రాంతీయ కమిటీలను అధిష్టానం ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కమిటీల్లో ఆయా జిల్లాలకు చెందిన వీర మహిళలకు అవకాశం కల్పించారు. ఉత్తరాంధ్ర పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు, గోదావరి కమిటీ పరిధిలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా పెన్నా పరిధిలో విజయవాడ నగరంతోపాటు.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, రాయలసీమ కమిటీ పరిధిలో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలను చేర్చారు.

ఉత్తరాంధ్ర ప్రాంతీయ కమిటీలో టి.లక్ష్మీ రాజ్‌, ఆదిమూలం శరణి దేవి, సిహెచ్‌.కిరణ్‌, కొత్తపల్లి త్రివేణి, ఎమ్‌.నాగలక్ష్మిలకు అవకాశం కల్పించారు. గోదావరి ప్రాంతీయ కమిటీ-లో చల్లా లక్ష్మి, కడలి ఈశ్వరి, ముత్యాల జయలక్ష్మీ, కాట్నం విశాలక్ష్మీ, కసిరెడ్డి మధులతలకు చోటు దక్కింది. అలాగే, కృష్ణా – పెన్నా ప్రాంతీయ కమిటీ-లో రావి సౌజన్య, మల్లెపు విజయలక్ష్మి, కురిమెళ్ళ లక్ష్మీ సరస్వతి, బి.పార్వతి నాయుడు, బొందిల శ్రీదేవి, కోలా విజయలక్ష్మీలను ఎంపిక చేశారు. రాయలసీమ ప్రాంతీయ కమిటీ-లో పెండ్యాల శ్రీలత, పసుపులేటి పద్మావతి, ఆకుల వనజ, కుప్పాల జ్యోతి, షేక్‌ మొహమ్మద్‌ హసీనా బేగమ్‌లను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement