Sunday, April 28, 2024

AP: గులకరాయి డ్రామాలో.. బీసీ బిడ్డను బలిచ్చేందుకు జగన్ కుట్ర.. అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… గతంలో కోడికత్తి డ్రామాలో ఒక దళిత బిడ్డను ఐదేళ్ల పాటు జైలుపాలు చేశారని.. ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన సతీష్ అనే అమాయకపు యువకుడిని ఇరికిస్తున్నారని ఆరోపించారు. కిరాయి ఇస్తామని తీసుకెళ్లారని, డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారని… కడుపులో మండి గులకరాయి విసిరాడని సదరు వ్యక్తి చెప్పాడని… దీనికి టీడీపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. టీడీపీపై నెట్టడానికి సిగ్గనిపించటం లేదా అంటూ విరుచుకుపడ్డారు. కోడికత్తి డ్రామా సమయంలో అధికారంలో ఉన్నవారే బాధ్యత వహించాలన్నారని గుర్తుచేశారు.

‘‘ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరే, బాధ్యత వహించాల్సింది మీరే’’ అని పేర్కొన్నారు. చిన్న గులకరాయి తగిలితే ఏదో జరిగిపోయిందంటూ డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డిలో మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. రాజకీయాలకు బదులు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లి ఉంటే దేశం గర్వించే మంచి నటుడు అయ్యేవారన్నారు. 24 క్లెమోర్ బాంబులు పేలి 15 అడుగుల మేర ఎగిరి పడిన వ్యక్తి కూడా ఏ రోజూ సానుభూతి కోసం ప్రయత్నించలేదని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement