Thursday, May 2, 2024

AP: ప్రజలకు మంచి చేయడం కోసమే జగనన్న సురక్ష: సీఎం జగన్‌

ప్రజలకు మంచి చేయడం కోసమే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌ తాడేపల్లి సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి మాట్లాడుతూ… వివిధ కారణాలతో మిగిలిపోయిన లబ్ధిదారులకు మంచి చేయడమే జగనన్న సురక్ష అన్నారు. ఏ కారణం చేతనైన అర్హత ఉండి మిగిలిపోయిన వారికి లబ్ధి చేకూరుస్తామన్నారు. రాష్ట్రంలో 600 రకాల పౌరసేవలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేవలు అర్హులందరికీ అందాలన్నారు. ప్రజలకు మంచి చేసే కార్యక్రమమే జగనన్న సురక్ష అన్నారు. నవరత్నాల ద్వారా రూ. 2లక్షల 16వేల కోట్లు అందించామన్నారు. ఎక్కడా లంచాలకు తావులేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్నామన్నారు. నేరుగా బటన్‌ నొక్కి అక్కా చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశామన్నారు.

సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు సంతృప్త స్థాయిలో పరిష్కారమే లక్ష్యమన్నారు. నెలరోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహణ ఉంటుందన్నారు. రేపటి నుంచి గృహాల సందర్శన ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.6 కోట్ల కుటుంబాలను బృందాలు
సందర్శించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 సురక్ష క్యాంపుల నిర్వహణ ఉంటుందన్నారు. ‘1902’తో హెల్ప్‌ డెస్క్‌ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలిపోకూడదన్న తపన, తాపత్రయంతో ప్రతి ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం జగనన్న సురక్ష అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో శాచ్యురేషన్‌ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేసిన జగనన్న ప్రభుత్వం.. అర్హులై ఉండి ఏ కారణంతోనైనా ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో ఈ జగనన్న సురక్ష ద్వారా ఇంటింటినీ జల్లెడ పట్టనుందన్నారు. తద్వారా వారికి లబ్ధి చేకూర్చడంతో పాటు వారికింకేమైనా సర్టిఫికెట్లు (జనన, మరణ, కుల, సీసీఆర్సీ, రేషన్‌ కార్డు డివిజన్, హౌస్‌ హోల్డ్‌ డివిజన్, ఇన్‌కమ్‌ మొదలైన 11 రకాలు ధ్రువీకరణ పత్రాలు) అవసరమైతే సర్వీస్‌ ఫీజు లేకుండా వాటిని ఉచితంగా అందించనుందన్నారు. కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా.. లంచాలకు, వివక్షకు తావులేకుండా.. నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందించాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రతి ఇంటికీ వెళ్లి సమస్యలేమైనా ఉంటే తెలుసుకుని పరిష్కారం చూపించే దిశగా చేస్తున్న వినూత్న కార్యక్రమం ఈ జగనన్న సురక్ష అన్నారు.

వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, జగనన్న మీద, జగనన్న ప్రభుత్వం మీద ప్రేమ, అభిమానం ఉన్న ఉత్సాహవంతులతో కూడిన టీమ్‌ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటినీ సందర్శిస్తుందన్నారు. అర్హులై ఉండి ఎక్కడైనా లబ్ధి అందని వారుంటే వారిని గుర్తించి సమస్య పరిష్కారానికి కావల్సిన పత్రాలు సేకరిస్తారు. వారికేమైనా కుల, ఆదాయ, జనన మొదలైన సర్టిఫికెట్లు అవసరమైతే వాటికి అవసరమైన పత్రాలను తీసుకుని దరఖాస్తులను దగ్గరుండి పూర్తిచేస్తారన్నారు. ఇలా తీసుకున్న దరఖాస్తులను సచివాలయానికి తీసుకెళ్లి వాటిని అక్కడ సమర్పించి, టోకెన్‌ నంబర్, సర్వీస్‌ రిక్వెస్ట్‌ నంబరు తీసుకుని వాటిని తిరిగి ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తారన్నారు. ఈ క్యాంపులు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారో ముందుగానే తెలియజేస్తారన్నారు. ఆ రోజు దగ్గరుండి క్యాంపు వద్దకు తీసుకెళ్తారన్నారు. సమస్య పరిష్కారమయ్యేలా వారికి తోడుగా ఉంటారన్నారు. మండల స్థాయి అధికారులైన తహశీల్దార్, ఈఓపీఆర్డీ ఒక టీమ్‌ కాగా.. ఎంపీడీఓ, డిప్యూటీ తహశీల్దార్‌ రెండో టీమ్‌గా ఏర్పడి సచివాలయంలో ఒకరోజు పూర్తిగా గడిపేలా చూస్తారన్నారు. జూలై 1 నుంచి ప్రతి సచివాలయంలో క్యాంపు నిర్వహించి అక్కడికక్కడే పథకాల సమస్యలను పరిష్కరించడంతో పాటు సేవా చార్జీలు లేకుండానే అవసరమైన సర్టిఫికెట్లను అందిస్తారన్నారు. జనన, మరణ, కుల, ఆదాయ, కుటుంబ, వివాహ ధ్రువీకరణ పత్రాలు, లావాదేవీ మ్యుటేషన్లు, ఫోన్‌ నంబర్‌కు ఆధార్‌ అనుసంధానం, పంట సాగు కార్డులు, కొత్త రేషన్‌ కార్డు లేదా రేషన్‌ కార్డు విభజన, ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో మార్పులు చేర్పులు వంటి 11 రకాల సర్టిఫికెట్లను ఉచితంగా జారీతో పాటు మరే ఇతర అవసరమైన సర్టిఫికెట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న సురక్ష’ కార్యక్రమంలో అందిస్తుందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement