Friday, May 17, 2024

నేడు అదానీ డేటా సెంటర్, భోగాపురం ఎయిర్ పోర్టులకు జగన్ భూమి పూజ

విశాఖ – ముఖ్యమంత్రి జగన్ బుధవారం ముందుగా విశాఖలో పర్యటించనున్నారు. అదానీ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్లకు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ అదానీ కూడా పాల్గొనబోతున్నారు. మధురవాడలో ఏర్పాటు చేయబోతున్న ఈ పార్క్లో అదానీ సంస్థ 14,634 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సీఎం జగన్ తాడేపల్లిలో బయల్దేరి హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ గౌతమ్ అదానీని రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి విశాఖ చేరుకుంటారు. అక్కడ మధురవాడలో ఏర్పాటు చేయబోయే టెక్ పార్క్కు శంకుస్థాపన చేస్తారు. విశాఖ పర్యటన అనంతరం విజయనగరంలో పర్యటిస్తారు. బుధవారం భోగాపురం ఎయిర్పోర్టుకు కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 3,500 కోట్ల రూపాయలతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. 2025 సెప్టెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం.

Advertisement

తాజా వార్తలు

Advertisement