Monday, May 6, 2024

AP: చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్ దే బాధ్యత : యనమల

జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగనే బాధ్యత వహించాలని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ధృవీకరణ పత్రం ఇస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. అమరావతి టీడీపీ కార్యాలయంలో సమావేశమైన నేతలు చంద్రబాబు అరెస్ట్, తరువాత పరిస్థితులపై ప్రధానంగా చర్చించారు. అనంతరం యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ చంద్రబాబుకు ఏం టెస్టులు చేశారని ఆరోగ్యం బాగుందంటున్నారని ఆరోపించారు.

ఈ క్రమంలో టెస్టులకు సంబంధించిన పత్రంపై ఏ డాక్టర్ సంతకం చేయలేదని చెప్పారు. టెస్టులను ధృవీకరించడానికి సూపరింటెండెంట్ ఎవరని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్న యనమల చంద్రబాబుని వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement