Monday, May 6, 2024

ముగిసిన జగన్ లండన్ పర్యటన.. ఏపీకి చేరుకున్న సీఎం

గ‌న్నవ‌రం – లండన్ పర్యటన ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డి నేడు ఏపీకి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో వారికి స్వాగతం పలికేందుకు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ పి.జాషువా , మంత్రులు జోగి రమేష్, పినిపే విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ విఫ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ బాలశౌరి, నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి, వల్లభనేని వంశీ, కొలుసు పార్థ సారథి, మల్లాది విష్ణు తదితర నేతలు సీఎంకు ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement