Friday, April 26, 2024

బ‌కాయిలు చెల్లించండి – సీతారామ‌న్ కు జ‌గ‌న్ విన‌తి..

ఢిల్లీ – ఎపికి రావాల్సిన వివిధ బ‌కాయిల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఎపి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ ను కోరారు.. అలాగే పోలవరం నిర్మాణం వేగవంతం చేసేందుకు రూ.10వేల కోట్లు అడ్వాన్స్ గా ఇవ్వాలని అభ్యర్ధించారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న నేటి ఉద‌యం ఆర్ధిక‌మంత్రితో భేటి అయ్యారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు ఉన్నాయని, వెంటనే ఈ డబ్బు మంజూరుచేయాలని కోరారు.. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తప్పులేకున్నా,రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదని ఆమెకు వివ‌రించారు. నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారని, 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లుకు కుదించార‌ని తెలిపారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉందని, ఈ డబ్బును వెంటనే ఇప్పించాల్సిందిగా కోరారు సీఎం జగన్‌.


మరోవైపు, 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయని, వాటిని విడుదల చేసేలా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు సీఎం..
పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్ గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలని కోరిన సీఎం. డయాఫ్రంవాల్ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.2020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని, వెంటనే ఈ నిధులు విడుదలచేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చుచేసిన రూ.2600.74 కోట్ల రూపాయలను సత్వరమే రీయింబర్స్ చేయాలని కోరారు.. పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింద‌ని,. దీనికి వెంటనే ఆమోదం తెలపాలని ఆర్ధిక‌మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు..ఈ భేటి అనంత‌రం జ‌గ‌న్ ప్ర‌త్యేక విమానంలో విజ‌య‌వాడ‌కు బ‌య‌లుదేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement