అమరావతి, ఆంధ్రప్రభ : నాటు సారా తయారీదారులపై పి.డి.యాక్టు ప్రకారం కేసులు పెట్టాలని ఆబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి అధికారులను ఆదేశించారు. సారా తయారీ దారులకు కౌన్సిల్లింగ్ నిర్వహించి ప్రత్యామ్నయ జీవనోపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అక్రమ సారా, లిక్కర్ రవాణాలో స్వాదీనం చేసుకున్న వాహనాలను వేలం వేయాల్సినదిగా అధికారులకు ఆయన సూచించారు. నూతన బార్ పాలసీ నియమ, నిబంధలను త్వరితగతిన రూపొదించాలన్నారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఆబ్కారీ శాఖ ఉన్నతాధకారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ వీడియో కాన్పరెన్సు ద్వారా పాల్గొన్న ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రమ సారాను అరికట్టండంలో అధికారులు ప్రణాళికాబద్దంగా కృషిచేస్తున్నారని అభినందించారు.
అయితే రాష్ట్రంలో చెదురు మదురుగా జరుగుచున్న నాటు-సారా తయారీని పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాధం మోపాలన్నారు. . స్టేట్ ఎ-కై-్సజ్ బోర్డు పనితీరును సమీక్షిస్తూ ఎస్.ఇ.బి. స్టేషన్ల నిర్వహణ ఖర్చులను చెల్లించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. సమీక్షా సమావేశంలో స్పెషల్ సి.ఎస్. రజత్ భార్గవ, కమిషనర్ వివేక్ యాదవ్, ఎ.పి.ఎస్.బి.సి.ఎల్. ఎం.డి. వాసుదేవ రెడ్డి, స్టేట్ ఎకైజ్ బోర్డు సంచాలకులు రమేష్ రెడ్డి, కమిషనర్ రవి శంకర్ అయ్యాన్నర్, ఆబ్కారీ శాఖ అదనపు కమిషనర్ దేవ కుమార్ తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.