Friday, May 3, 2024

విక్టర్ కుమార్ కి ఇంటర్నేషనల్ సోషల్ ఎంట్రప్రిన్యూర్ అవార్డు

స్థానిక హడ్కో కాలనీకి చెందిన సి.పి.హెచ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు జల్లి జార్జిపాపప్ చేసిన విశిష్ట సేవలకు గుర్తుగా ఆ సంస్థ ముఖ్య కార్యదర్శి రెవరెండ్ డాక్టర్ జల్లి విక్టర్ కుమార్ కు ఇంటర్నేషనల్ సోషల్ ఎంట్రప్రిన్యూర్ అవార్డు లభించింది. ఈ మేరకు శనివారం చెన్నైలో ఉన్న వై.యం.సి.ఏ మద్రాసు ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో విక్టర్ కుమార్ఇంటర్నేషనల్ సోషల్ ఎంట్ర ప్రిన్యూర్ అవార్డు అందుకున్నట్లు సి. పి.హెచ్ (క్రిస్టియన్ ప్రేయర్ హౌస్) మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్.జల్లి జార్జి పాఫప్ తెలిపారు.

ఈ అవార్డును గ్లోబల్ పీస్ అండ్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికాకు చెందిన హెచ్. ఈ ప్రొఫెసర్, ఏమినెంట్ సైంటిస్ట్, వ్యవస్థాపక చైర్మన్ కం చీఫ్ రెక్టర్ ఆఫ్ ఎ.యు.జి.పి.జి.పి, యు.ఎన్ యు.జి.పి (యు.ఎస్.ఏ) కి చెందిన డాక్టర్ మధు కృష్ణన్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం తన అదృష్టమని విక్టర్ కుమార్ తెలిపారు. కల్వరి క్రిస్టియన్ ప్రేయర్ హౌస్ మినిస్ట్రీస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా సమాజంలో చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేసారని విక్టర్ కుమార్ వివరించారు. ఈ అవార్డు ద్వారా తనకు మరింత బాధ్యత ఏర్పడిందని రాబోయే కాలంలో మరిన్ని సామాజిక కార్యక్రమాలను చేపడతానని విక్టర్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ది గ్లోబల్ పీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ అద్దంకి రాజా, డాక్టర్ డి. సత్యమూర్తి , లైన్ పీకే సత్యనారాయణ, ఎస్ శ్రీనివాసు (ఉండి వాసు) జీకే బాబు, డాక్టర్.స్టెల్లా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement