Friday, May 3, 2024

Inner Ring Road Case : చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ 26కు వాయిదా

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలను 26న వింటామని హైకోర్టు తెలిపింది. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని గత టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. అయితే, రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను ఇష్టం వచ్చినట్టు మార్పులు చేశారని జగన్ ప్రభుత్వం ఆరోపించింది.

టీడీపీ ప్రభుత్వం చేబట్టిన రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై అభియోగాలు మోపింది. తమ భూములకు విలువ పెరిగేలా అలైన్ మెంట్ మార్చారని ఆరోపించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఈనెల 26కు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement