Thursday, May 16, 2024

Tirupati: ఎస్పీ నూతన క్యాంప్ కార్యాలయం ప్రారంభం

తిరుపతి సిటీ, జూన్ 23, ప్రభ న్యూస్ : తిరుపతి ఎస్పీ నూతన క్యాంప్ కార్యాలయం భవనం ప్రారంభోత్సవం జరిగింది. ఈ క్యాంపు కార్యాలయ భవనాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తిరుపతి ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ ఎస్.ఈ.బి. స్టేట్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తిరుపతి జిల్లా ప్రజలకు నూతన క్యాంపు కార్యాలయం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదనపు ఎస్పీలు వెంకట్రావు, డీఎస్పీలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement