Friday, May 3, 2024

నాగార్జున వర్సిటీ కి ఇంపాక్ట్ ర్యాంక్..

ప్రభన్యూస్ : లండన్ కు చెందిన టైమ్స్ ఉన్నత విద్యా సంస్థ 2022 కు విడుదల చేసిన ఇంపాక్ట్ ర్యాంకుల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మెరుగైన ర్యాంకులను సాధించింది. ప్రపంచ స్థాయి ఓవరాల్ కేటగిరిలో 601- 800 మధ్య, దేశ స్థాయిలో 23వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకును విశ్వవిద్యాలయం సాధించింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం అదనపు ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ఐక్యరాజ్యసమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు అన్నింటిలోనూ ర్యాంకులు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

రెక్టార్ ఆచార్య వర ప్రసాద మూర్తి మాట్లాడుతూ ఈ ర్యాంకుల తో విశ్వవిద్యాలయం ఉన్నత శిఖరాలకు చేరిందన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ కరుణ మాట్లాడుతూ ర్యాంకుల సాధనతో ఉద్యోగులు అధ్యాపకులు మరింత ఉత్సాహంగా పని చేయాలన్నారు. అనంతరం అదనపు ఉపకులపతి రాజశేఖర్ ర్యాంకుల సమన్వయకర్త డాక్టర్ నాగ కిషోర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement