Friday, May 3, 2024

ICC World Cup : టీమిండియా ఓడింది… ఒక‌రి గుండె ఆగింది…

వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా పరాజయం పాలైంది… కోట్లాదిమంది అభిమానులను కలిచివేసింది. అయితే ఓ క్రికెట్ అభిమాని గుండె ఆగేలా చేసింది. వరల్డ్ కప్ క్రికెట్‌లో భారత్ ఓటమిని జీర్ణించుకోలేక ఓ అభిమాని గుండె ఆగి మృతిచెందిన ఘటన… కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. స్నేహితులతో కలిసి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను తిరుపతి రూరల్ మండలానికి చెందిన సాప్ట్ వేర్ ఇంజనీర్ జ్యోతి కుమార్ ఎంతో ఉత్సాహంగా చూస్తూ వచ్చాడు. ఇండియా ఓటమి చెందడంతో ఆ బాధను తట్టుకోలేని జ్యోతికుమార్… ఒక్కసారిగా కుప్పకూలాడు. జ్యోతికుమార్‌ను ఆస్పత్రికి తరలించేలోపే మరణించాడు.

తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రానికి చెందిన జ్యోతిష్ కుమార్ యాదవ్ క్రికెట్ అభిమాని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా బెంగళూరులో పని చేస్తున్నాడు.. దీపావళి సెలవుల నిమిత్తం సొంత గ్రామానికి వచ్చారు. వరల్డ్ కప్ మ్యాచ్ టీవీలో తిలకిస్తు ఉండగా.. ఇండియా ఓడిపోవడంతో హఠాత్తుగా గుండె పోటు వచ్చింది. కుటుంబ సభ్యులు తిరుపతి రూయాస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే జ్యోతిష్ కుమార్ యాదవ్ మృతి చెందాడు. దీంతో మృతుడి స్వగ్రామమైన దుర్గా సముద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement