Friday, May 3, 2024

ఆత్మకూరులో భారీగా గంజాయి పట్టివేత..

శ్రీశైలం నియోజకవర్గం లోని ఆత్మకూరు పట్టణంలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి గంజాయిని పట్టుకున్నారు.. ఒకరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆత్మకూరు డిఎస్పి శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టణానికి చెందిన షాకీర్ హుస్సేన్ ఇంటిపై పోలీసులు సబ్ అధికారులు దాడులు నిర్వహించి సుమారు 19.5 కేజిల గంజాయి ని పట్టుకోవడం జరిగిందని అతని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామన్నారు..

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి లారీలో గంజాయిని ఆత్మకూరుకు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు.. ఇంకా ఎవరైనా సంఘ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నట్లు తెలిసినా తమ దృష్టికి తేవాలని కోరారు.. మాదకద్రవ్య రహిత సమాజానికి తమ వంతుగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.మాదకద్రవ్యాల వినియోగానిక యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement