Wednesday, May 1, 2024

AP: ఆర్థిక మంత్రి బుగ్గ‌న ఇల్లు ముట్ట‌డి…

‘దగా డీఎస్సీ వద్దు.. మెగా డీఎస్సీ ముద్దు’ అంటూ నంద్యాల జిల్లా డోన్‌లో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇంటిని ముట్టడించారు. 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. నేడు మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను పట్టుకునే ప్రయత్నంలో పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ కింద పడిపోయారు. అనంతరం ఎన్‌ఎస్‌యూఐ నేతలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement