Tuesday, April 30, 2024

Home – 13 గంటల సుదీర్ఘ ప్రయాణం… ఉండవల్లి నివాసానికి చేరుకున్న చంద్ర బాబు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు రాజమహేంద్రవరంలో బయలుదేరిన చంద్రబాబు బుధవారం ఉదయం 5 గంటలు దాటాక ఉండవల్లి చేరుకున్నారు. నివాసానికి చేరుకోగానే చంద్రబాబుకు సతీమణి నారా భువనేశ్వరి హారతిచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆమె దిష్టి తీశారు. మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుని గుమ్మడికాయలు కొట్టారు.

బుధవారం ఉదయం 5 గంటలు దాటాక ఉండవల్లి చేరుకున్నారు. నివాసానికి చేరుకోగానే చంద్రబాబుకు సతీమణి నారా భువనేశ్వరి హారతిచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆమె దిష్టి తీశారు. మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుని గుమ్మడికాయలు కొట్టారు.స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి నిన్న సాయంత్రం రోడ్డుమార్గాన బయలుదేరారు. అడుగడుగునా తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రాజధాని రైతులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు దారి పొడవునా హారతులు పట్టి తమ అభిమాన నేతను చూసి భావోద్వేగానికి గురయ్యారు. సుమారు 13 గంటలపాటు చంద్రబాబు ప్రయాణం చేశారు. కరకట్ట నుంచి చంద్రబాబు నివాసం వరకు రైతులు పూలబాట పరిచారు

Advertisement

తాజా వార్తలు

Advertisement