Friday, May 3, 2024

AP: విద్యుత్‌ ఉద్యోగుల ధర్నాకు హైకోర్టు అనుమతి

అమరావతి: విద్యుత్‌ ఉద్యోగుల ధర్నాకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ధర్నాకు అనుమతి కావాలని కోరుతూ విద్యుత్‌ సంఘాలు వేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈమేరకు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. ఈనెల 10న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30గంటలలోపు ధర్నా చేసుకోవాలని ఉద్యోగుల సంఘానికి సూచించింది. అంతకు ముందు విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు అనుమతి నిరాకరించారు.. దీంతో విద్యుత సంఘం అనుమతి కోసం హైకోర్టు ను ఆశ్రయించింది.. విచారణ జరిపిన న్యాయస్థానం షరతులతో అనుమతి మంజూరు చేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement