Friday, May 3, 2024

తిరుమల కాలినడక మార్గంలో అయిదో చిరుత సంచారం

తిరుమల: అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత సంచారం శ్రీవారి భక్తులను కలవరానికి గురిచేస్తోంది. కాలిబాటలో లక్ష్మీనరసింహ ఆలయం వద్ద చిరుత తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్‌ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇటీవల చిరుత దాడికి గురై మరణించిన చిన్నారి లక్షిత(6) మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు. ఇప్ప‌టికే నాలుగు చిరుత‌ల‌ను ప‌ట్టుకున్న అట‌వీ శాఖ తాజాగా క‌నిపించిన ఆయిదో చిరుత‌ను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. వివిధ ప్రాంతాల‌లో బోనులు ఏర్పాట్లు చేశారు. కాలిన‌డ‌క భ‌క్త‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement