Saturday, May 4, 2024

భార్య‌పై కోపంతో గొంతుపిసికి చంపేశాడు.. శ్రీకాకుళం జిల్లాలో ఘటన..

ఎచ్చెర్ల (ప్ర‌భ న్యూస్‌): శ్రీ‌కాకుళం జిల్లాలో ఘోరం జ‌రిగింది. కుటుంబ కలహాలతో భర్త , భార్యను చంపేశాడు. ఈ ఘటన బుధవారం తెల్ల‌వారు జామున శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎచ్చెర్ల మండలం పూడివలసలో బి. నాగరత్న(46) ఫరీద్ పేటలో ఎ ఎన్ ఎంగా పనిచేస్తున్నారు. కుటుంబ కలహాలతో భార్య, భర్తల మధ్య రాత్రి గొడవ జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి కోపం తెచ్చుకున్న భర్త .. భార్యను గొంతు పిసికి చంపేశాడ‌ని స్థానికులు చెబుతున్నారు.

హత్య అనంతరం పోలీసుల ముందు నాగరత్నం భర్త లొంగిపోయాడు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నాగరత్నం హత్యతో ఎచ్చెర్ల మండలం పూడివలసలో విషాదం నెల‌కొంది. బాలుడు భవిష్యత్తుని తలుచుకొని మృతురాలి బంధువులు కన్నీటి పర్యంతo అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement