Friday, April 26, 2024

అతను నా అల్లుడు కాదు.. మాకు రిలేష‌న్ లేదు: సోము వీర్రాజు

అమరావతి-ఆంధ్రప్రభ : రెండు రోజులుగా తన అల్లుడిపై కేసు నమోదైనట్లు వస్తున్న వార్తలు నిజం కాదని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తనకు ముగ్గురు కూతుర్లు ఉన్నప్పటికీ ఇద్దరికి మాత్రమే కాళ్లు కడిగి కన్యాదానం చేశానని, తాను వివాహం చేయలేదు కాబట్టి అతను తన అల్లుడు కాదని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల‌ సమావేశంలో ఆయన మాట్లాడారు.

తన మొదటి కుమార్తె 2005లోనే అతనితో వెళ్లిపోయింది అని సోము వీర్రాజు అన్నారు. గతంలో అతని వ్యవహారాలకు సంబంధించి అప్పటి ఏలూరు రేంజ్ డీఐజీకి తానే స్వయంగా ఫిర్యాదు చేశానని చెప్పారు. ఒక క్రమశిక్షణ గల పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నడవడిక సక్రమంగా లేని వ్యక్తులతో ఉండలేను అన్నారు. దయచేసి  అతను తన అల్లుడు అనే ప్రచారం చేయొద్దని, పార్టీ కార్యకర్తలు, ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకే వివరణ ఇస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement