Monday, April 29, 2024

GVL: అమరావతికి నిధులివ్వాలని కేంద్రాన్ని ఎందుకు అడగరు?: వైసీపీ సర్కార్ కు జీవీఎల్ ప్రశ్న

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటును బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్వాగతించారు. అయితే వసతులు,సదుపాయాలు లేకుండా కొత్త జిల్లాల్ని ఏర్పాటుచేస్తే ఎలా? అని ప్రశ్నించారు. అమరావతి తరహాలో కొత్త జిల్లాలను చేయవద్దన్న జీవీఎల్.. అమరావతి అభివృద్ధికి నిధులివ్వాలని కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదని నిలదీశారు.

కాగా, ఏపీలో కొత్తగా 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో అమరావతి అభివృద్ధికి నిధులే ప్రధాన కారణమని ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన జీవీఎల్, అమరావతి కోసం నిధులు కావాలని కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement