Friday, April 26, 2024

పదవుల ఎంపికలో సామాజిక తూకం పాటిస్తోన్న ‘జగన్’

అమరావతి :  ఏపీ సీఎం వైఎస్ జగన్ పదవుల ఎంపికలో..అభ్యర్థుల నిర్ణయంలో పారదర్శకత..సామాజిక తూకం పాటిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని ఆయన తెలిపారు.   వైసీపీలో కష్టపడిన వారికి పదవులు వస్తాయనే నమ్మకం  కార్యకర్తలకు ఉందని చెప్పారు. కౌన్సిల్లోని మందబలాన్ని ఆసరా చేసుకుని ఇన్నాళ్లూ టీడీపీ ఏదో చేద్దామనుకుందని అన్నారు. మార్చి నెలాఖరుతో మండలిలో సంపూర్ణ మెజార్టీ రాబోతోందన్నారు. ఇకపై  వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం-అభివృద్ధి సమపాళ్లతో కూడిన పాలన దిగ్విజయంగా సాగనుందని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement