Friday, April 19, 2024

బీజేపీ పతనం ఢిల్లీ నుంచే మొదలైంది: రేవంత్

త్వరలో దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తథ్యమని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఐదు మున్సిపల్ కార్పొరేషన్ వార్డులకు ఫిబ్రవరి 28న ఉప ఎన్నిక జరగగా.. ఇటీవల వెలువడిన ఫలితాల్లో అన్నింట్లోనూ బీజేపీ ఓటమి పాలైంది. దీంతో బీజేపీ పతనం ఢిల్లీ నుంచి మొదలైందని, ఇక గల్లీ దాకా కొనసాగడం ఖాయమని రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో బీజేపీ ఓటమి త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు తొలి సంకేతమని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement