Friday, April 26, 2024

బస్ షెల్టర్ ప్రాంతాన్ని పరిశీలించిన‌ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

మంగళగిరి తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రి వద్ద ప్రధాన కూడళ్లతో పాటు ఎన్నారై జంక్షన్ వద్ద కూడలిలో ఏర్పాటు చేయనున్న బస్ షెల్టర్ల నిర్మాణం చేప‌ట్టే ప్రాంతాలను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మంగళవారం ఉదయం పరిశీలించారు. సీఎం క్యాంపు కార్యాలయం మార్గం వెంబడి ఆక్రమణలకు గురైన డ్రైనేజ్ కాలువను పరిశీలించి డ్రెయిన్ టు డ్రెయిన్ రోడ్డు విస్తరణకు ప్రతిపాదన సిద్ధం చేయాలని సూచించారు. కమిషనర్ శారదా దేవి డిఎస్పీ రాంబాబు డీఈ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement