Friday, May 17, 2024

తెలంగాణ ఉద్యోగుల‌ను ఆక్క‌డికి పంపివేయండి…. జ‌గ‌న్ ఆదేశం

అమ‌రావ‌తి – తెలంగాణకు చెందిన ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు తమ ఇబ్బందులను సీఎం వైయస్‌ జగన్ కు వివరించారు. తమను తెలంగాణ రాష్ట్రానికి పంపాలని సీఎం ను ఉద్యోగులు కోరారు. గతంలోనే రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో కేసీఆర్‌ వద్ద ఈ విషయాన్ని జగన్‌ ప్రస్తావించారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తెలంగాణ నుంచి ఫైల్‌ ఏపీకి పంపించింది. వెంటనే ఫైల్‌ క్లియర్‌ చేసి ఉద్యోగులను తెలంగాణకు పంపాల్సిందిగా జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ గొప్ప మనసుతో అంగీకరించి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement